రాజధాని రైతుల భూములు 2వేల ఎకరాల గోల్ మాల్ !

అమరావతి కో సం రైతులు ఇచ్చిన భూముల్లో రెండు వేల ఎకరాలకుపైగా భూములు కనిపించకుండా పోయాయి. అసలు రికార్డుల్లో లేవు. అడ్డగోలుగా రికార్డులు మార్చేసి ఆ భూములు లేవని చూపిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని పరిధిలో ల్యాండ్‌ పూలింగ్ జరిగిన సమయంలో తొలి సంవత్సరం 28,654 మంది రైతులు 34,398 ఎకరాలు పూలింగు రూపంలో ఇచ్చారు. ప్రభుత్వ భూములు మరో 15 వేల ఎకరాల వరకూ తీసుకున్నారు. మొత్తం 53 వేల ఎకరాలు రాజధాని పరిధిలో సిఆర్‌డిఎ చేతుల్లోకి వెళ్లింది.

సీఆర్డీఏలోని 9.14 అగ్రిమెంటు ప్రకారం రైతులు ఇచ్చింది 34,398 ఎకరాలు. ఇది పూర్తిగా రైతుల వద్ద నుంచి సిఆర్‌డిఎ అధికారులు సర్వేచేసి దగ్గరుండి అగ్రిమెంటు చేయించుకున్న భూమి. ఇప్పుడు రికార్డుల్లో 32,059 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 2,339 ఎకరాలు రికార్డుల్లో నుండి తొలగిపోయింది. ఇంత పెద్దఎత్తున భూములు ఎలా మాయం అయ్యాయనేది ప్రశ్నగా మారింది. సాధారణంగా ఒక ఎకరా లేదా నాలుగైదు ఎకరాలు తేడా రావొచ్చని, కానీ ఏకంగా 2,339 ఎకరాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్న వస్తోంది.

సిఆర్‌డిఎకు అప్పగించిన తరువాత భూములు ఏమైనా చేసుకోవచ్చని, కానీ తాము ఇచ్చిన భూమే తగ్గిందని చూపించడం వెనుక కుట్ర ఉందని రైతులు అంటున్నారు. పూలింగులో తీసుకున్న భూముల స్థితి మారినా ఇంత పెద్దఎత్తున తేడా రాదని, దీనివెనుక భారీ కుంభకోణం ఉందని, విచారణ జరిపించాలని కోరుతున్నారు. సీఆర్డీఏలో చేరిన ఓ ప్రత్యేక అధికారి.. అదికార పెద్దలతో కలిసి ఈ స్కాం చేశారన్న అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలో ఈ స్కాం బయటపడే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close