మోడీ బలం .. విపక్షాలే !

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వారికి మోడీ బలం బీజేపీ కాదు విపక్షాలేనన్న అంశంపై ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ పక్షాలకు ఉన్న ఓట్లు కంటే ఎక్కువే పోల్ అయ్యాయి. ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మ‌ద్ద‌తుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేసిన‌ట్లుగా కౌంటింగ్‌ను బట్టి తెలుస్తోంది. అంటే విపక్ష పార్టీల ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి తృణమూల్ కాంగ్రెస్ హ్యాండిచ్చేసింది.

అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా… సరే జాతీయంగా బీజేపీతో వ్యతిరేక పోరాటం చేయడానికిసిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి వారికి .. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది కాబట్టి ఎదుర్కోక తప్పదు. లేకపోతే బీజేపీ ఆయా పార్టీలను మింగేస్తుంది. ఆ పరిస్థితి ఆ పార్టీలే తెచ్చుకున్నాయన్న విషయం తర్వాత సంగతి. కానీ ఇప్పటికైతే విపక్షాల్లో బీజేపీకి ఎదురొడ్డి నిలిచే పార్టీ లేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాను రాను దారుణంగా మారుతోంది. ఇతర పార్టీలు బీజేపీకి సామంతులుగా ఉంటున్నాయి. పోరాడుతున్న ఒకటి రెండు పార్టీలకు గత్యంతరం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మోదీకి ఎదురుందన భావించడం లేదు. మోదీని ఎదుర్కోగల సమర్థుడైన నేత లేనప్పుడు…ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రయోజనం ఉండదు. ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తేనే ఓటేస్తారు. లేకపోతే.. వాతలు పెట్టిన వారికి ఎదురెళ్లి గండం తెచ్చుకోవాలని అనుకోరు. ఇప్పుడు దేశ ప్రజలది అదేపరిస్థితి. అందుకే మోదీకి బలం విపక్షాలేనని అనుకోవాల్సిన పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close