బైబై జగన్ – క్లియర్ సందేశం పంపిన నవశకం సభ !

విశాఖలో స్థలం ఇవ్వలేదు.. విజయనగరంలో ఓ మరుమూల ప్రాంతంలో సభ పెట్టుకున్నారు. బస్సులివ్వలేదు.. రైళ్లలో వచ్చారు. ప్రైవేటు బస్సులు మాట్లాడుకుని వచ్చారు. కార్లు..బైకులు మీద వచ్చారు. చివరికి సర్వీస్ ఆటోలు పట్టుకుని వచ్చారు. లక్షలాది మంది యువగళం నవశకం సభకు వచ్చారు. పార్టీ నేతలు ఎంత మందిని సమీకరణ చేశారో.. అంతకు రెండింతలు స్వచ్చందంగా తరలి వచ్చారు. టీడీపీ, జనసేన కలిస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. పోలిసపల్లి సభ కనివినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయింది.

యువగళం ముంగింపు సభ.. జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పడేలా సాగింది. రాజకీయ సభను ఇంత ప్రణాళికాబద్దంగా నిర్వహించవచ్చా అని ఆశ్చర్యపోయేలా సభ జరిగింది. సభలో మాట్లాడిన వారంతా సూటిగా.. పగ్రజలకు సందేశం ఇచ్చారు. ప్రజలు పడుతున్న కష్టాలను వారికి గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు. వారి కోసం మేమున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. యువత కోసం మేమున్నామని కలసి వస్తున్నామని భరోసా ఇచ్చారు. జనాల్ని పీడించుకుని తిని.. ఇప్పుడు ెమ్మెల్యేలను మారుస్తామని అంటున్నారని..మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని.. జగన్ రెడ్డినేనని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ తన సహజసిద్దమైన ఆవేశానికి భిన్నంగా ప్రసంగించారు జగన్ రెడ్డి పాలనలో అరాచకాల్ని గుర్తు చేశారు. కలిసి పోటీ చేస్తోంది ప్రజల కోసమేనన్నారు. నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. పంచ్‌లు.. ప్రాసలతో హోరెత్తించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాదయాత్ర పూర్తి చేశానన్న సంతృప్తి ఆయనలో కనిపించింది. జగన్ రెడ్డిపై పోరాటంలో విజయం సాధించబోతున్నామన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. చివరిగా మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని..రాష్ట్రాభివృద్ధిని పరుగులుపెట్టిస్తామన్నారు.

అన్నింటికన్న మిన్నగా ప్రజలకు భద్రత, భరోసా వారి ఆస్తులకు రక్షణ.. భవిష్యత్ కు గ్యారంటీ ఇస్తామని భరోసా ఇచ్చారు. మొత్తంగా యువగళం – నవశకం సభతో.. టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్‌లో ప్రారంభించాయని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close