హిట్ కాంబోని రిపీట్ చేస్తున్న నితిన్‌

‘ఇష్క్‌’ సినిమాని నితిన్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేడు. ఎందుకంటే.. వ‌రుస ఫ్లాపుల త‌ర‌వాత త‌న‌కు ఓ హిట్ ఇచ్చిన సినిమా అది. త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కాన్ని క‌లిగించిన సినిమా ఇది. త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డ‌డానికి అవ‌కాశం ఇచ్చిన సినిమా అది. అందుకే ఆ సినిమా అంటే విప‌రీత‌మైన ప్రేమ‌. స్క్రీన్ ప్లేల‌లో ఓ ఆట ఆడుకొనే విక్ర‌మ్ కె.కుమార్ ఓ సింపుల్ ల‌వ్ స్టోరీ కూడా తీయ‌గ‌ల‌డ‌ని నిరూపించిన సినిమా అది. అయితే ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబోలో మ‌రో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఈ కాంబోలో ఓ సినిమా రాబోతోంది.

అవును… నితిన్‌, విక్ర‌మ్ మ‌ళ్లీ ప‌ని చేయ‌డానికి స‌మాయాత్తం అవుతున్నారు. ఈ సినిమాని నితిన్ త‌న సొంత బ్యాన‌ర్‌లోనే నిర్మించాల‌ని చూస్తున్నాడు. ఇటీవ‌ల ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’, ‘ఎక్ట్స్రా’ సినిమాల‌తో వ‌రుస ప‌రాజ‌యాలు తెచ్చుకొన్నాడు నితిన్‌. ప్ర‌స్తుతం `రాబిన్ హుడ్‌` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ‘త‌మ్ముడు’ అనే మ‌రో సినిమా కూడా ప‌ట్టాల‌పై ఉంది. ఇవి రెండూ పూర్త‌య్యాక విక్ర‌మ్ కె.కుమార్ తో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ నితిన్ కోసం క‌థ‌ని సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close