ఈ వేస‌వి.. ఎన్టీఆర్‌కు నో రెస్ట్‌!

సాధార‌ణంగా వేస‌వి రాగానే, హీరోలంతా వెకేష‌న్ మూడ్‌లో ఉంటారు. కొంత‌మంది హీరోలు అప్పుడే… విహార యాత్ర‌ల్ని ప్లాన్ చేసేసుకొన్నారు. కానీ ఈ వేస‌విలో ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోవ‌డం లేదు. త‌న ‘దేవ‌ర‌’ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌న్న తొంద‌ర‌లో ఉన్నాడు. అందుకే ఫోక‌స్ అంతా ఈ సినిమాపై పెట్టాడు. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర‌’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చ‌క చ‌క సాగుతోంది. హైద‌రాబాద్‌లో కీల‌క‌మైన స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. యాక్ష‌న్ పార్ట్ దాదాపుగా పూర్తయ్యింది. ఈవారంలోనే చిత్ర‌బృందం గోవా వెళ్ల‌బోతోంది. అక్క‌డ ఎన్టీఆర్ – జాన్వీల‌పై ఓ పాట‌ని, కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 10న విడుద‌ల చేయ‌నున్నారు. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే అనిరుధ్ సార‌ధ్యంలో కొన్ని పాట‌ల్ని రికార్డ్ కూడా చేసేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ త‌ర‌వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దాంతో పాటు ‘జ‌న‌తా గ్యారేజ్‌’ కాంబో రిపీట్ అవుతోంది. దాంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close