‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల ‘పుష్ష 2’ గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే… మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం పెద్ద లోటు. టీజ‌ర్ కూడా హడావుడిగా క‌ట్ చేసిన‌ట్టు అనిపించింది. ఫోక‌స్ అంతా గంగ‌మ్మ జాత‌ర‌పైనే పెట్టారు. మిగిలిన క్యారెక్ట‌ర్ల‌ని ఏమాత్రం ప‌రిచ‌యం చేయ‌లేదు.

అయితే బ‌న్నీ బ‌ర్త్ డేకి 2 వెర్ష‌న్ల‌లో టీజ‌ర్ క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌దాంట్లో గంగ‌మ్మ జాత‌ర‌ సెట‌ప్ ఉంటే, రెండోది మిగిలిన ఫుటేజ్‌తో క‌ట్ చేశారు. ఆ టీజ‌ర్‌లో పుష్ష వ‌ర‌ల్డ్ మొత్తం చూపించారు. అయితే.. బ‌న్నీ పుట్టిన రోజున‌, బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని మాత్ర‌మే హైలెట్ చేయాల‌న్న ఉద్దేశంతో గంగ‌మ్మ జాత‌ర టీజ‌ర్ వ‌దిలారు. ఇప్పుడు రెండో టీజ‌ర్ కూడా రెడీగానే ఉంది. దాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ‘పుష్ష 2’కి సంబంధించిన పాట‌ల‌న్నీ దాదాపు రెడీ అయిపోయాయి. ముందుగా ఓ పాట వ‌దిలి, ఆ త‌ర‌వాత సిద్ధంగా ఉన్న రెండో టీజ‌ర్‌ని చూపించాల‌నుకొంటుంది చిత్ర‌బృందం. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అంటే..నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది. అందుకే… టీజ‌ర్ విడుద‌ల చేసే విష‌యంలో ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close