గోదావరి జిల్లాల్లో వైసీపీకి జీరో – ఇదే పవన్ టార్గెట్ !

గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ తన టార్గెట్ గురించి తరచూ చెబుతున్నారు. అదేమిటంటే.. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేయడం. తాజాగా నర్సాపురం నేతలతో సమావేశం అయిన పవన్ కల్యామ్.. ఇదే లక్ష్యాన్ని పార్టీ నేతల మందు పెట్టారు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్ది.. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు. ఆ స్థాయిలో జనసైనికులు, జనసేన నాయకులు బలంగా పని చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. ప్రతీ చోటా పార్టీ నేతలకు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేయాల్సిన దారుణాలన్నీ చేశారన్నారు. అప్పట్లోనే ఎస్సైని వేసి కొట్టిన వ్యక్తి ఆయన. ..ఇప్పుడు వైసీపీ నాయకులు, వారి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఎస్పీ, డీఎస్పీలను కొడుతున్నారని మండిపడ్డారు. బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని తోటలోకి తీసుకువెళ్లి కాల్చేస్తే పోలీసుల స్పందించలేదు. రేపటి రోజున ఆ దాష్టీకాలు మన ఇళ్లలోకి వస్తాయని హెచ్చరించారు.

గోదావరి జిల్లాల్లో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితగా వస్తోంది. 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికలలో అత్యధిక సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఆ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ సారి పవన్ కల్యాణ్ .. తన పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నది కూడా గోదావరి జిల్లాల్లోనే అనుకుంటున్నారు. అందుకే .. వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేసి.. అధికారానికి దూరం చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close