యువగళం ముగింపుసభకు పవన్ దూరం !

టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదు. గతంలో పదిహేడో తేదీన బహిరంగసభ ఖరారు చేశారు. కానీ తుపాను కారణంగా పాదయాత్రకు మూడు రోజులు పాటు విరామం ఇవ్వాల్సి రావడంతో ఇరవయ్యో తేతీనసభను ఖరారు చేశారు. ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఎన్నికల సన్నాహాక సభగా కావడంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఏడు ప్రత్యేక రైళ్ళతో కార్యకర్తలు విశాఖకు తరలి వెళ్లనున్నారు .

ముందస్తు కార్యక్రమాల వల్లనే పవన్ కల్యాణ్ సభకు హాజరు కావడం లేదని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే సమయమంలో టీడీపీ నేతలు కూడా.. ఇది యువగళం ముగింపు సభ కాబట్టి.. లోకేష్‌కు క్రెడిట్ ఇచ్చేలా పూర్తస్థాయిలో సభ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే సన్నాహాలు, ప్రచారం చేస్తున్నారు. పవన్ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు యువగళం ముగింపు సభతోనే టీడీపీ ఎన్నికల ప్రచారభేరీ మోగించినట్లు అవుతుంది.

ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించే అవకాశం ఉంది. టీడీపీ, జనేసన ఉమ్మడి ప్రచారం కూడా జోరుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా నాగార్జున యూనివర్శిటీ వద్ద నిర్వహించాలనుకున్న సభను రైతులు రద్దు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close