పోలీసు వ్యవస్థ నిర్వీర్యం – ఇక ఈసీ చేతుల్లోనే !

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు… ఉద్రిక్తతలు, గొడవలను చూస్తే పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని అర్థం చేసుకోవచ్చు. పల్నాడులో టీడీపీ కార్యాలయాల్ని తగులబెట్టడం.. ప్రచారానికి వెళ్తున్న వారిపై దాడులు చేయడం దగ్గర్నుంచి ఒంగోలు బాలినేని రెండు రోజుల పాటు నిర్వహించిన ఆందోళనల్లో.. పోలీసులపై రుబాబు, ఆస్పత్రిదాడి వంటి ఘటనల్లో అసలు వ్యవస్థ అంటే వైసీపీ వారికి బయం లేదని తేలిపోయింది. చివరికి.. సీఎం భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు పోలీసుల్ని వైసీపీ నాయకులు చితక్కొట్టిన ఘటన గుంటూరులో ఒక్క రోజు ముందే జరిగింది.

ఇక పెద్దిరెడ్డి సొంత సామ్రాజ్యంగా మార్చుకున్న పుంగనూరులో ఇతర పార్టీల వాళ్లు ప్రచారానికి వెళ్తే ఎదురవుతున్న పరిస్థితులపై వీడియోలు వచ్చినా.. చర్యలు శూన్యం. ఎన్నికల నిర్వహణ మొత్తం తమ కనుసన్నల్లో ఉండేలా చూసుకునే విషయంలో … వైసీపీ నేతలు చాలా ముందు చూపుతో వ్యవహరించారు. కొంత మందిని తొలగించినా.. మళ్లీ తమ వాళ్లే పోస్టుల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రభావాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏపీలో ఎన్నికల నిర్వహణ కొన్ని గ్రామాల్లో తప్ప ప్రశాంతంగా జరిగిపోతుంది. కానీ ఈ సారి మాత్రం.. రావణకాష్టం చేయడానికి పాలకులే స్వయంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి మరీ ప్రయత్నిస్తున్నారని అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలో మొత్తం బాధ్యత ఉన్న ఈసీ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. సమర్థులైన అధికారుల్ని పెట్టి.. ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. మరి ఈసీ ఏం చేయబోతోందో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close