అభిమానుల గోల‌.. అలిగిన ప్ర‌కాష్‌రాజ్‌

స్టార్ హీరో ఆడియో ఫంక్ష‌న్ అంటే అభిమానులు చేసే గోల అంతా ఇంతా కాదు. వేదిక‌పై త‌మ హీరో రావాల‌ని, ఆయ‌నే మాట్లాడాల‌ని ప‌ట్టుబ‌ట్టి కూర్చుంటారు. కేక‌లు వుస్తుంటారు. సాధార‌ణంగా ఇలాంటి సిత్రాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆడియో ఫంక్ష‌న్లో క‌నిపిస్తుంటాయి. `భ‌ర‌త్ అనే నేను` లో కూడా ఈ దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్ తో పాటు, ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వ్వ‌డంతో ఆ కేరింత‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ప్ర‌కాష్‌రాజ్ వేదికపై మాట్లాడుతున్న‌ప్పుడు అభిమానుంతా `పాద‌ర్‌.. ఫాద‌ర్‌` అంటూ అరిచారు. `ఏంట్రా మీ గోల‌` అంటూ కాసేపు స‌ర‌దాగానే తీసుకున్న ప్ర‌కాష్ రాజ్‌కి ఆ త‌ర‌వాత ప‌రిస్థితి అర్థ‌మైంది. ఇక త‌న‌ని మాట్లాడ‌నివ్వ‌ర‌ని తెలుసుకుని, వేదిక నుంచి.. వ‌డివిడిగా కింద‌కు వ‌చ్చేశారు. యాంక‌ర్ సుమ వారిస్తున్నా వినిపించుకోకుండా ప్ర‌కాష్ రాజ్ కింద‌కు వ‌చ్చేసి, అట్నుంచి అటే బ‌య‌ట‌కు వెళ్లి పోయారు. ఈ త‌తంగం అంతా మ‌హేష్‌, ఎన్టీఆర్‌లు ఆశ్చ‌ర్యంగా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి బ‌హిరంగ స‌భ‌ల్లో, ఇంత మంది జ‌న సందోహం వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటివి మామూలే. ప్ర‌కాష్ రాజే లైట్ తీసుకుని ఉంటే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close