యూపీ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి వచ్చినట్లే..! ప్రియాంక దూకుడు ..!

యూపీలో వట్టిపోయిన కాంగ్రెస్ పార్టీని రక్షించుకుేనందుకు ప్రియాంక గాంధీ తూర్పు యూపీ బాధ్యతలను తీసుకున్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతం. అయినా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. గంగా యాత్ర.. ఆలయాల సందర్శన.. ఇలా ప్రియాంక ఎన్నికల ప్రచారం కొత్తగా ఉంది. ప్రియాంక వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తోంది. యూపీలో శక్తి యాప్‌ సభ్యత్వాలు అమాంతం పెరగడం… లోకల్‌ నేతలకు జోష్‌ ఇస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రియాంక ఎంట్రీ తర్వాత 22 శాతం పెరుగుదల కనిపించడం కాంగ్రెస్‌ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్‌ పార్టీ శక్తియాప్‌ను తయారు చేసింది. ఇక్కడ ప్రతి నిర్ణయానికి ముందు శక్తి యాప్‌లో పోల్‌ పెడుతారు. మెజార్టీ కార్యకర్తలు సూచించిన దానికే అధిష్టానం కూడా ఓటేస్తుంది. అంతేకాదు… హైకమాండ్‌ పెద్దలు కూడా కార్యకర్తలతో నేరుగా టచ్‌లోకి రావొచ్చు. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రియాంక గాంధీ… మహిళలను పార్టీ వైపు ఆకర్షించేలా చేస్తున్నారు. యూపీ ఓట్‌ బ్యాంక్‌లో 50 శాతంగా ఉన్న మహిళల టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇటీవల ప్రియాంక గాంధీ ర్యాలీల్లోనూ మహిళలే అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలతో ప్రియాంక కలిసిపోతున్న తీరు… అందరినీ ఆకట్టుకుంటోంది. యూపీలో కాంగ్రెస్‌ పార్టీ నిశబ్ధంగా బలపడుతుందని చెబుతున్నారు.

అయోధ్యలో మకాం వేసిన ప్రియాంక.. హిందూ బెల్ట్‌లో ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. అక్కడ విద్యార్థులతో మమేకమయ్యారు. అంతేకాదు… రాచరిక కుటుంబం అంటూ మోదీ, బీజేపీ చేస్తోన్న విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు. రాచరిక కుటుంబాలకు ఉండే అధికారాలన్నింటినీ.. ఇందిరాగాంధీయే రద్దు చేశారని చెప్పారు. ఇపుడు తాము అందరిలో ఒకరిగానే ఉంటున్నట్లు తెలిపారు. అంతేకాదు… దేశంలో నీది ఏ మతం అని అడగని రోజు రావాలని కలలు కంటున్నట్లు తెలిపారు ప్రియాంక. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రియాంక కటౌట్‌ ఇపుడు పవర్‌ఫుల్‌గా మారుతోంది. మోదీకి నేరుగా కౌంటర్లు ఇస్తూ.. తెలివిగా రాజకీయం చేస్తోంది. అప్పుడప్పుడూ.. వారణాశిలో పోటీ చేస్తే తప్పేమిటని ప్రకటిస్తూ.. రాజకీయ సంచలనాలకూ… కారణం అవుతోంది. మొత్తానికి యూపీలో ఆట మాత్రం మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close