మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే… ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ సినిమా మొద‌లెట్టినా, ముందుగా ఓ ప్రెస్ మీట్ పెట్టి, సినిమా కాన్సెప్ట్ గురించి మీడియాకు చెప్ప‌డం జ‌క్క‌న్న ఆన‌వాయితీ. ఈసారీ అదే చేయ‌బోతున్నాడు. కానీ.. తొలిసారి జ‌క్క‌న్న సినిమా కోసం ఓ కాన్సెప్ట్ వీడియో కూడా రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. క‌థ గురించి, క్యారెక్ట‌ర్ల గురించి చూచాయిగా ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించ‌బోతున్నాడ‌ట రాజ‌మౌళి. అందుకు సంబంధించిన క్రియేటీవ్ వ‌ర్క్ కూడా మొద‌లైంద‌ని స‌మాచారం. మ‌హేష్ మిన‌హాయిస్తే మిగిలిన కాస్టింగ్ ఎవరూ ఫైన‌లైజ్ కాలేదు. ప్ర‌తినాయకుడి పాత్ర కోసం హాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. క‌థానాయిక‌ల ఎంపిక కూడా క్లిష్ట‌మైన ప్ర‌క్రియే. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర‌వాతే.. రాజ‌మౌళి మీడియా ముందుకు వ‌స్తార‌ని స‌మాచారం. మ‌హేష్ లుక్ టెస్ట్ కోసం రాజ‌మౌళి దాదాపు నెల రోజులు కేటాయించార‌ని తెలుస్తోంది. అందుకోసం మేక‌ప్ నిపుణుల‌తో ప్ర‌త్యేక‌మైన స్కెచ్‌లు రూపొందించార్ట‌. మ‌హేష్ కూడా పాత్ర‌కు అనుగుణంగా త‌న ఫిజిక్ మార్చుకొనే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close