ఆంజ‌నేయుడిగా రానా?

బాహుబ‌లి త‌ర‌వాత రానా ప్ర‌యాణం పూర్తిగా మారిపోయింది. కొత్త కొత్త పాత్ర‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. త‌న‌కు న‌ప్పే పాత్ర‌లే ఎంచుకొంటున్నాడు. గుణ‌శేఖ‌ర్ ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకొన్న హిర‌ణ్య‌క‌శ్య‌ప పాత్ర రానాని వ‌రించింది. తాజాగా మ‌రో మైథ‌లాజిక‌ల్ క్యారెక్ట‌ర్ రానా చెంత‌కు చేరింది. త్వ‌ర‌లో రానా.. ఆంజ‌నేయుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. `రావ‌ణ‌` సినిమాని తెర‌కెక్కించాల‌ని మోహ‌న్ బాబు ఫ్యామిలీ ఎప్ప‌టి నుంచో గ‌ట్టిగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. రావ‌ణ‌గా మోహ‌న్‌బాబు క‌నిపించ‌బోతున్నారు. కొంత‌మంది బాలీవుడ్ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించ‌య‌నున్నారు. ఇందులో హ‌నుమంతుడి పాత్ర రానాతో చేయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త రెండేళ్లుగా ఈ స్క్రిప్టుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. అంత‌ర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ప‌నిచేయ‌నున్నారు. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. ఓ ద‌శ‌లో రాఘవేంద్ర‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మోహ‌న్‌బాబుకీ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాల‌ని ఉంద‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఆంజ‌నేయ స్వామి పాత్ర రానాకే ద‌క్కింద‌ని స‌మాచారం. మ‌రి ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో, ద‌ర్శ‌కుడు ఎవ‌రో తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close