మ‌రో ఆప్ష‌న్ లేదా వినాయ‌క్‌..??

‘ఖైది నెం. 150’ హిట్ త‌ర‌వాత కూడా వినాయ‌క్ ఖాళీగా ఉన్నాడంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. బాహుబ‌లి త‌ర‌వాత రికార్డుల‌న్నీ.. ఖైదీ పేరిటే ఉన్నాయి. అలాంటి ద‌ర్శ‌కుడు హీరోల కోసం వెదుక్కోవ‌డం విచిత్ర‌మే. ఖైది త‌ర‌వాత చాలా గ్యాప్ తీసుకుని సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్‌’ తీశాడు. అదేమంత ఇంటిలిజెంట్ మూవ్ కాద‌ని, ఆ త‌ర‌వాత అర్థ‌మైంది. ఆ సినిమా ఫ్లాప్‌తో వినాయ‌క్ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డిపోయాడు. బాల‌కృష్ణ‌తో కాంబినేష‌న్ తెర‌పైకి వ‌చ్చినా… అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఇప్ప‌టికీ ‘బాల‌య్య‌తో సినిమా లైన్‌లోనే ఉంది’ అంటున్నాడు. బాల‌య్య – వినాయ‌క్ కాంబినేష‌న్ ఉండొచ్చు, ఉండ‌క‌పోవొచ్చు. ఒక‌వేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా.. బాల‌య్య ఖాళీ అవ్వ‌డానికి టైమ్ ప‌డుతుంది. ‘ఎన్టీఆర్‌’ అయిన వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా మొద‌ల‌వుతుంది. అదెప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. అప్ప‌టి వ‌ర‌కూ వినాయ‌క్ ఖాళీగా ఉండ‌లేడు క‌దా? ఎప్పుడైతే బాల‌య్య ‘ఎన్టీఆర్‌’ ప‌నుల్లో ప‌డిపోయాడో.. అప్పుడు వినాయ‌క్ మ‌రో ఆప్ష‌న్ చూసుకోవాల్సింది. అయితే ఇప్ప‌టికీ ‘బాల‌య్య సినిమా’నే న‌మ్ముకోవ‌డం ఏమిటో అర్థం కాదు. టాప్ ద‌ర్శ‌కులంతా బిజీగా ఉన్న స‌మ‌యంలో వినాయ‌క్‌లాంటి మాస్ ద‌ర్శ‌కులు హీరోల కోసం ఎదురు చూడ‌డం వింత‌గానే ఉంది. అఖిల్‌, ఇంటిలిజెంట్ ఫ్లాపుల మ‌హ‌త్మ్య‌మే ఇదంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close