రాష్ట్రాలు దివాలా తీస్తే అసలు తప్పు కేంద్రానిదే !

అపరిమితంగా అప్పులు చేసి దివాలా దిశగా కొన్ని రాష్ట్రాలు వెళ్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ రాష్ట్రాలను నియంత్రించాల్సింది కేంద్రమే. ఎందుకంటే రాష్ట్రాల అప్పులు పూర్తిగా కేంద్ర అనుమతుల మీదనే ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. అయినా కేంద్రం చూసీ చూడనట్లుగానే ఉంటోంది.

ప్రధాని మోదీ సైతం ఓట్ల కోసం ప్రజలకు ఉచిత పథకాలు పంపిణీ చేయడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. అప్పులు కుప్పలు కుప్పలుగా చేసి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్న రాష్ట్రాలు కళ్లముందు కనిపిస్తున్నా ప్రధాని మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రధాని మోదీ అభిప్రాయం వందకు వంద శాతం నిజమే. ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులకూ విలువ ఉండదు..రాదు. అాలంటి దేశాలు ఏమైపోయాయో శ్రీలంక చెబుతుంది. మరి ఎందుకు కేంద్రం నియంత్రించలేకపోతోంది

మౌలిక సదుపాయాల కోసం ప్రజాధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా అప్పులు చేస్తూ సంక్షేమం పేరుతో ప్రజలకు పంచే రాజకీయ వ్యూహాలే ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడి వ్యయం చేయడాన్ని అనవసరంగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నారు.

రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే… ఆ తప్పులో సింహ భాగం వాటా కేంద్రానికే దక్కుతుంది. ఇప్పుడు శ్రీలంకలో అలా జరిగిందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సుద్దులు చెప్పినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దిగజారిపోయింది. పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి.. కేంద్రమే బాద్యత తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత తాము ముందే హెచ్చరించామంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నష్టపోయేది దేశం. అందుకే రాష్ట్రాలు దివాలా తీస్తే అది దేశానికి నష్టం.. ఆ పాపం కేంద్రానిదే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close