పవన్ , చంద్రబాబుపై రాళ్ల దాడులు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

జగన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేశారని వైసీపీ ప్రారంభించిన క్షుద్ర రాజకీయం ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక రాళ్ల దాడులకు దారి తీస్తోంది. పోలీసు వ్యవస్త పూర్తి స్థాయిలో నిద్రాణంగా ఉండిపోతోంది. జగన్ రెడ్డిపై ఎవరు దాడి చేశారో ఎవరికీ తెలియదు. కనీసం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. అదేదో సైబర్ దాడి అన్నట్లుగా ఏమీ తెలియనట్లుగా నిస్సహాయంగా ఉండిపోయింది యంత్రాంగం. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేసి వారిపై రాళ్ల దాడులకు తమ కార్యకర్తలను ప్రోత్సహిస్తోంది.

తెనాలి పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త పవన్ కల్యాణ్ పై రాయి విసిరాడు. అదిదూరంగా పడింది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాజువాకలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన వాహనం వెనుక గుండా వచ్చి దుండగులు రాళ్లు వేశారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు వాహనం వద్దకు పోలీసుల్ని దాటుకుని రాళ్లతో ఎలా వచ్చారన్నది పెద్ద సస్పెన్స్ మారింది. రాళ్లు వేసి పక్కా ప్లాన్ తో పక్క సందులోకి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినట్లుగా షో చేశారు.

ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక దాడులకు వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నా.. పోలీసుల వైపు నుంచి ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదు.. పూర్తి స్థాయిలో వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. తప్పుడు రాజకీయాలతో కోడికత్తి దాడులు.. రాళ్ల దాడులు చేయించుకుని ప్రత్యర్థులపై నిందలు వేసి వారిపై దాడులకు కుట్రలు చేయడం ఏపీ రాజకీయాల్లో కొత్త కాన్సెప్ట్ గా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో .. ఇంకెన్ని జరుగుతాయోనని.. ప్రజలు కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close