జనసేనానికి తప్పిన ప్రమాదం.. వైసీపీ ప్లానేనా..?

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. గుంటూర్ జిల్లా తెనాలిలో వారాహి యాత్ర కొనసాగుతుండగా పవన్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అది పవన్ కళ్యాణ్ కు తగలకుండా కొద్ది దూరంలో పడిపోవడంతో పవన్ ప్రమాదం నుంచి సేఫ్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది రాయి విసిరిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.

జగన్ పై రాయి దాడి ఘటన మరవకముందే పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరగడం చర్చనీయాంశం అవుతోంది. జగన్ పై దాడి పక్కా ప్రతిపక్షాల ప్లానేనని ఆరోపణలు చేస్తోంది వైసీపీ. దీంతో ప్రతీకారంగా వైసీపీ మూకలే పవన్ పైకి దాడికి ఉసిగొల్పాయా.? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి జనసేన శ్రేణులు.

జగన్ పై దాడి జరిగిన వెంటనే చంద్రబాబు, పవన్ తో సహా ప్రతిపక్ష నేతలంతా ఖండించారు. ఇలాంటి దాడులు సరికాదని ప్రకటించారు. అయినప్పటికీ ఆదివారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు.. చంద్రబాబు, పవన్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

జగన్ పై దాడిని ప్రతిపక్షాల కుట్రేనని ఓ కథ గతంలో కోడికత్తి తరహాలో అల్లేశారు. కట్ చేస్తే.. సాయంత్రానికి పవన్ పై ఓ వ్యక్తి దాడికి యత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ పై దాడి ప్రతిపక్షాల కుట్రే అయితే…పవన్ పై దాడి వైసీపీ నేతల కుట్రేనా అంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close