ఏపీలో వైసీపీ వేధింపులా? ఇదిగో సుజనా రక్షణ…

ఘరానా మొగుడు సినిమాలో ఓ విజిటింగ్ కార్డు చూపించి… అది కేవలం విజిటింగ్ కార్డు కాదు.. విష్ముమూర్తిచేతిలో భూచక్రం అని చెబితే… హీరో నిజమే అనుకుని అంత కాన్ఫిడెన్స్‌గా ప్రొసీడ్ అయిపోతాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఎంపీ సుజనా చౌదరి ఆంద్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున బెదిరింపులు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పుకుని బదెరింపులకు దిగుతున్నారని.., ఇలాంటి వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. అసలు గొడవేంటి అన్న వివరాలను మెయిల్ చేయాలని కోరారు.

ఆ మెయిల్ అడ్రస్ పేరు.. saveandhrapradesh2022@gmail.com. ఈ మెయిల్ అడ్రస్‌కు .. బెదిరింపులకు గురైన వారి వివరాలు పంపితే మిగతా విషయాలు తాను చూసుకుంటానని సుజనా చౌదరి చెబుతున్నారు. విశాఖలో హయగ్రీవ్ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు.. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేతపై దాడి వంటి విషయాలను సుజనా చౌదరి గుర్తించారు. అయితే సుజనా చౌదరి ఇక్కడ చిన్న షరతు పెట్టారు. అదేమిటంటే.. ముందుగా బెదిరింపులకు గురవుతున్న వారుపోలీసులకు ఫిర్యాదు చేయాలట.

ఆ ఫిర్యాదు కాపీలను కూడా తనకు పంపాలట. మిగతాది తాను చూసుకుంటానంటున్నారు. ఏపీలో ఇలాంటి ఫిర్యాదులు చేయడం.. . చేసి ప్రశాంతంగా ఉండటం… ప్రాణాలు కాపాడుకోవడం అంత సులువైన ప ని కాదని.. సుజనా చౌదరికి ఇంకా అర్థమైనట్లుగా లేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న ఏపీ ప్రజలను కాపాడటానికి సుజనాచౌదరి ఇంకా సరళమైన మార్గాన్ని కనిపెట్లాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close