నేనెప్పుడూ డబ్బుల కోసమే చేస్తా : తమన్నా

టాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్ చేసే స్టార్ క‌థానాయిక అన‌గానే త‌మన్నా గుర్తొస్తుంది. త‌మ‌న్నా మంచి డాన్సర్ క‌మ్‌ గ్లామ‌ర్ క్వీన్ క‌మ్ స్టార్ కాబ‌ట్టి.. ఆమెకు ఐటెమ్ గీతాల అవ‌కాశాలు హోరెత్తుతున్నాయి. ఒకొక్క పాట‌కూ రూ.50 నుంచి 70 ల‌క్షల వ‌ర‌కూ తీసుకొంటోంద‌ని స‌మాచారం. జాగ్వార్ సినిమా కోసం ఏకంగా రూ.90 ల‌క్షలు పారితోషికంగా అందుకొంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటోంద‌న్న విమ‌ర్శలొస్తున్నాయి. వీటిపై త‌మ‌న్నా స్పందించింది. ”ఐటెమ్ గీతాలే కాదు.. సినిమాలు కూడా నేను డ‌బ్బుల కోస‌మే చేస్తాను క‌దా? క‌థానాయిగానూ, ఐటెమ్ గాళ్‌గానూ నేను డ‌బ్బులు బాగానే తీసుకొంటా. అలాంట‌ప్పుడు రెండింటినీ వేరుగా ఎందుకు చూస్తారు?” అంటూ తెలివిగా ప్రశ్నిస్తోంది త‌మ‌న్నా.

”నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను డాన్స్ చేస్తే చూడాల‌ని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వాళ్లంద‌రి కోసం, నా కోసం నేను ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటున్నా. సౌత్ ఇండియాలో క‌థానాయిక‌లు ఐటెమ్ గీతాలు చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తారు. అదే బాలీవుడ్‌కి వెళ్లండి. అక్కడ ఇలాంటి అవ‌కాశం ఎప్పుడొస్తుందా అని స్టార్ హీరోయిన్లంతా ఎదురుచూస్తుంటారు. అదృష్టం కొద్దీ నాకు ఐటెమ్ గీతాల అవ‌కాశాలు బాగా వ‌స్తున్నాయి. అందుకే చేస్తున్నా” అని క్లారిటీ ఇచ్చింది. డ‌బ్బుల కోస‌మే ఐటెమ్ గీతాలు చేస్తా అని నిర్మొహ‌మాటంగా చెప్పేయ‌డానికి కూడా గట్స్ ఉండాల్లెండి. మొత్తమ్మీద మ‌రిన్ని ఐటెమ్ గీతాల‌కు త‌మ‌న్నా రెడీ అన్నమాట‌. ఇక నిర్మాత‌ల‌దే ఆల‌స్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close