టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు పూర్తి !

తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకున్నారు. ఎన్ని సీట్లు, ఏ ఏ స్థానాలు అన్నది కూడా ఖరారు చేసుకున్నారు. అధికారిక ప్రకటన పండగ ముగిసిపోయిన తర్వాత చేయనున్నారు. సీట్లు, స్థానాల విషయంలో వైసీపీ చేసే వికృత రాజకీయాలు జనసేన విషయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంతగా అసలు విషయాలు బయటకు రాకుండా సర్దుబాట్లు పూర్తి చేశారు. పవన్, నాదెండ్ల , చంద్రబాబుతో పాటు లోకేష్ అతి కొద్ది మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది.

పవన్ కల్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో హడావుడి చేసే వైసీపీ కోవర్టులను పక్కన పెడితే… జనసేన పార్టీ నేతలు.. క్యాడర్ పవన్ నిర్ణయాన్ని కాదనే పరిస్థితి లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల్లోనే వారికి వారే అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే.. క్షేత్ర స్థాయి క్యాడర్ కలవకపోవడం అనే సమస్య ఉండదని గట్టిగా నమ్ముతున్నారు. పోటీ చేయబోతున్న స్థానాలపై స్పష్టత రావడంతోనే పవన్ కల్యాణ్.. కాకినాడలో మూడు రోజుల పాటు భేటీలు నిర్వహించారని చెబుతున్నారు.

త్వరలో ఆయన రాజమండ్రిలో కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లు తీసుకోవడం కన్నా.. పోటీ చేసిన సీట్లన్నింటిలో విజయం సాధించడం ముఖ్యమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అతి తక్కువస్థానాలకు పరిమితమవుతుందని ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close