కేసీఆర్‌ వల్లే కేంద్రం తగ్గిందా ? అంటే బిడ్ వేయరా ?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విశాఖలో చెప్పిన మాటలను బీఆర్ఎస్ నేతలు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. తమ పోరాటం వల్లనే కేంద్రం వెనక్కి తగ్గిందిని.. కేసీఆర్ దెబ్బ.. మోదీ అబ్బ అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇలా కేంద్ర మంత్రి చెప్పిన విషయం తెలియగానే అలా కేటీఆర్ , హరీష్ రావు .. బీఆర్ఎస్ సోషల్ మీడియా అందుకుంది. హైదరాబాద్‌లోనే ఉంటున్న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి కాలర్ ఎగరేసినంత పని చేశారు.

అయితే అసలు ఇప్పుడు ఎందుకింత హడావుడి చేస్తున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారా అంటే.. అసలు బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయింది స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మూలధనం, ముడిసరుకు సరఫరా కోసం జారీ చేసిన ఈవోఐ బిడ్‌లో పాల్గొనే అంశంపై. ఈ బిడ్‌లో పాల్గొంటామంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. సింగరేణి నుంచి అధికారుల బృందాన్ని పంపించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మాత్రం తాము ప్రైవేటీకరణను ఆపివేయించామని సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలకు తామే అండగా ఉన్నామని అంటున్నారు.

అదంతా సరే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ బిడ్ ను నిలిపివేసిందా అంటే.. అదేం లేదు. ఆ బిడ్ యధావిదిగా కొనసాగుతుంది. ఆ బిడ్ కు ప్రైవేటీకరణకు సంబందం లేదు. స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం ఇచ్చిన బిడ్ అది. అందులోనే పాల్గొంటామని బీఆర్ఎస్ చెబుతోంది. పదిహేనో తేదీ లాస్ట్ డేట్. పధ్నాలుగో తేదీ సెలవు. అంటే పదిహేనో తేదీ ఒక్క రోజే మిగిలి ఉంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయకపోతే.. ప్రజలు మరో రకంగా అనుకునే అవకాశం ఉంది. ఇంత హంగామా చేసి.. చివరికి బిడ్ వేయకుండా.. ప్రైవేటీకరణ ఆపామని ప్రచారం చేసుకుంటే… కామెడీ అయిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close