ప్రధానికి జగన్ ఇచ్చిన ఆ జ్ఞాపికల్ని వేలం వేస్తున్నారు !

ప్రధానమంత్రిని జగన్ ఎప్పుడు కలిసినా తిరుపతి ప్రసాదంతో పాటు ఓ మంచి విలువైన వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు విడుదల చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ప్రతిమలు ఇచ్చినందుకు.. జగన్ ఇచ్చే విజ్ఞాపన పత్రాల వల్ల రాజకీయంగా ఆయనకు ఏమైనా లాభం వచ్చిందేమోకానీ రాష్ట్రానికి మాత్రం వచ్చిందేమీ లేదు. చివరికి పోలవరం నిధులు కూడా రావడం లేదు. కానీ జగన్ ఇచ్చిన ప్రతిమల్ని మాత్రం వేలం వేస్తున్నారు.  వాటి విలును కూడా ఖరారు చేశారు. ఒక్కో ప్రతిమ విలువ ఇరవై వేలకుపైగానేఉంది. వాటిని ఎవరైనా కొనుక్కోవచ్చు.
ప్రధాని మోదీకి ఒక్క జగనే కాదు.. ఎవరు వెళ్లినా జ్ఞాపికలు ఇవ్వడం సహజమే. ప్రతీ రోజూ ఆయనకు ఇలాంటి మెమెంటోలు వస్తాయి. ఇతర దేశాలకు వెళ్లినా వస్తాయి. అలాంటి వాటిని ప్రధానమంత్రి సిబ్బంది జాగ్రత్త చేస్తారు. ఇవి ఎక్కువై పోవడంతో  వేలం వేస్తున్నారు. ప్రత్యేకంగా పీఎం మెమెంటోస్ పేరుతో ఆక్షన్ వెబ్ సైట్ ప్రారంభించారు. అందులో వచ్చినవన్నీ పెట్టారు. సీఎం జగన్ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కూడా ఉన్నాయి. వాటి కింద ఆయన ఇచ్చినట్లుగాపేరు కూడా ఉంది.
ఈ ప్రతిమల్ని వైసీపీ నేతలైనా కొనుక్కోవచ్చు.. లేదా..సామాన్య ప్రజలైనా కొనుక్కోవచ్చు. కేంద్రం ప్రకటించిన వెబ్ సైట్‌లోకి వెళ్లి ఆ మేరకు.. బిడ్డింగ్ దాఖలు చేస్తే చాలు. ఒక్కరే బిడ్డింగ్ వేస్తే అదే ధరకు ఇస్తారు. ఎవరైనా పోటీకి వస్తే వేలం పాట పెరుగుతుంది. వేలంపాట వివరాలకు http://pmmementos.gov.in వెబ్‌సైట్‌లో  సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వేలం పాడుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close