ఈవారం బాక్సాఫీస్‌: నీర‌సంగా… నిస్తేజంగా

స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే ఎలా ఉండాలి? కొత్త సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలి. ఉష్ణోగ్ర‌త‌ల‌తో వ‌సూళ్లు పోటీ ప‌డాలి. కానీ ఈ వేస‌వి మాత్రం నీర‌సంగా నిస్తేజంగా గ‌డిచిపోతోంది. ఏపీలో ఎల‌క్ష‌న్ల హంగామా ముందు బాక్సాఫీసు చిన్న‌బోతోంది. సినిమాల్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ధైర్యం చేయ‌డం లేదు. అందుకే కొత్త సినిమాల క‌ళ లేక‌.. థియేట‌ర్లు బోసిబోతున్నాయి. గ‌త‌వారం థియేట‌ర్ల‌లో సినిమాలేం రాలేదు. ఈసారీ అంతే. ఒకే ఒక్క సినిమా ‘పారిజాత ప‌ర్వం’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఒక‌ట్రెండు చిన్న సినిమాలు ఉన్నా, వాటిపై పెద్ద‌గా ఫోక‌స్ లేదు.

సునీల్‌, చైత‌న్య రావు, శ్ర‌ద్దా దాస్‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం ‘పారిజాత ప‌ర్వం’. ఇదో కిడ్నాప్ డ్రామా. సంతోష్ కుంభంపాటి ద‌ర్శ‌కుడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకొంటున్నాయి. ముఖ్యంగా వైవా హ‌ర్ష చేసిన కామెడీ ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచుతోంది. దీంతో పాటు శ‌ర‌పంజ‌రం, మార‌ణాయుధం అనే రెండు చిన్న సినిమాలు బాక్సాఫీసు ముందుకు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల‌లో స్టార్ బొమ్మ ప‌డాలంటే, మ‌ళ్లీ బాక్సాఫీసుకు జోష్ రావాలంటే ఏపీలో ఎన్నిక‌లు అయిపోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close