భ‌వ‌దీయుడులో.. భామ‌ల జోరు!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే.. `భ‌వ‌దీయుడు… భ‌గ‌త్ సింగ్‌`. ఈ సినిమా స్క్రిప్టు ఎప్పుడో లాక్ అయిపోయింది. సెట్స్‌పైకి వెళ్ల‌డ‌మే బాకీ. ఈలోగా న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు సాగుతోంది. ఈ సినిమాలో గ్లామ‌ర్‌కు ఏమాత్రం కొద‌వ లేకుండా హ‌రీష్ శంక‌ర్ జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని టాక్‌. ఓ క‌థానాయిక‌గా పూజా హెగ్డే దాదాపుగా ఫిక్స్‌. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. వాళ్ల కోసం ఇప్పుడు అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఓ హీరోయిన్ పాత్ర‌.. చాలా గ్లామ‌రెస్‌గా ఉండాల‌ట‌. ఆ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ కూడా చేయిస్తార‌ని స‌మాచారం. `గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో కెవ్వు కేక సూప‌ర్ హిట్ అయ్యింది. ప‌వ‌న్ సినిమాల్లోనే ది బెస్ట్ ఐటెమ్ గీత‌మ‌ది. అలాంటి పాట ఈసినిమా కోసం దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేశాడ‌ట‌. ఆ పాటలో ఓ హీరోయిన్ క‌నిపించాల్సిందే. ఇందులో ప‌వ‌న్ ఓ లెక్చ‌ల‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్ని చాలా ఫ్రెష్‌గా ఉండేలా రాసుకున్నాడ‌ట హ‌రీష్‌. త‌న బ‌లం.. రైటింగే. కామెడీ ఎపిసోడ్స్‌, ట్రాకుల‌తో… సినిమాని హాయిగా న‌డిపించేస్తాడు. అలాంటి ఎపిసోడ్లు కాలేజీ సీన్స్‌లో బాగానే ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close