వంగవీటి రాధా నోట “జగన్ రెడ్డి” మాట..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… జగన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూంటారు. ఇప్పుడు ఆ పేరును.. వంగవీటి రాధా కూడా అందుకున్నారు. పవన్ కల్యాణ్ తరహాలో జగన్ రెడ్డి అంటూ… ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ తర్వాత సైలెంటయిపోయిన విజయవాడ నేత వంగవీటి రాధాకృష్ణ.. రాజధాని రైతులకు మద్దతుగా బయటకు వచ్చారు. ఇటీవలి కాలంలో బహిరంగ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మూడు నెలల క్రితం.. పవన్ కల్యాణ్‌తో మాత్రం రెండు, మూడుసార్లు భేటీ అయ్యారు. అప్పుడు ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది… కానీ వంగవీటి మాత్రం.. అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. అలాగని. టీడీపీలోనూ చురుగ్గా లేరు. కానీ ఆయన రాజధాని రైతుల కోసం.. బయటకు వచ్చారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జిల్లాను, రైతులను జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేయడం రాజన్న రాజ్యమా?…పక్క రాష్ట్ర సీఎంతో గంటల తరబడి భేటీ అవుతున్న జగన్‌ రెడ్డికి రైతుల ఆందోళనలు కనిపివంచవా అని ప్రశఅనించారు. గత వారం.. చంద్రబాబు పాదయాత్రను బెంజ్ సర్కిల్ ప్రాంతంలో అరెస్ట్ చేసినప్పుడు… వంగవీటి రాధా.. చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో.. నడుచుకుంటూనే వెళ్లారు. ఇంటి దగ్గర పోలీసు నిర్బంధం ఉండటంతో.. రాధాను… చూసి.. లోకేష్ బయటకు వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు. దాంతో ఆయన.. టీడీపీ సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విషయం స్పష్టమయింది.

అయితే.. వంగవీటి రాధా… ప్రభుత్వంపై విమర్శలు చేసిన శైలి.. పవన్ కల్యాణ్‌ను.. తలపిస్తోంది. జగన్ రెడ్డి అంటూ.. పవన్ కల్యాణ్.. ఓ రకమైన చర్చను లెవనెత్తారు. దానికి ప్రతిఫలంగా పవన్ నాయుడు అంటూ.. వైసీపీ కాపు నేతలు పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేశారు. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు.. వంగవీటిపైనా.. వైసీపీ నేతలు.. అదే తరహా దాడులు చేస్తారో… లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close