ఇప్పుడు ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్ చేయరా !?

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై దాడి జరిగితే కోర్టుకు వెళ్లి మరీ ఎన్ఐఏ విచారణ తెచ్చుకున్నారు. ఐదేళ్ల తర్వాత తాము అనుకున్నట్లుగా విచారణ చేయలేదని ఆ ఎన్ఐఏపైనే నిందలు వేస్తున్నారు అది వేరే సంగతి. మరి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ పై రాయి పడింది. దాడికి ముందు కనీస భద్రతా చర్యలు లేవు. రాయి ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు. ఎలా దాడి చేశారో పట్టించుకోలేదు. అసలు కేసు నమోదు చేశారో లేదో కూడా బయటకు రాలేదు. ఇంత తేడాగా ఉన్నప్పుడు ఎందుకు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేయడం లేదు .

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై రాయి వేయడం అంటే చిన్న విషయం కాదు. సీఎం ప దవిలో వ్యక్తి ఉండవచ్చు కానీ.. ఆయన వెనుక ఓ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థపై దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి. అందులో ఉన్న భద్రతా లోపాల దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ లోతైన దర్యాప్తు చేయాలి. ఆ సామర్థ్యం రాష్ట్ర పోలీసులకు లేదని.. సీఎం ఏర్పాటు చేసుకున్న భద్రతా వ్యవస్థకు లేదని తేలిపోయింది. రాయి వేసిన వాళ్లెవరో కనీసం గుర్తించేందుకు ప్రయత్నించలేదు.

జగన్ వస్తున్న సమయలో జనాల్ని సాక్షి మీడియాతో పాటు చాలా వరకూ వీడియోలు తీశాయి. జగన్ రాయి పడిన సమయంలో వందల మంది లేరు. ఓ ఇరవై , ముఫ్పై మంది ఉంటారు. ఆ కొద్ది మందిని అందర్నీ అదుపులోకి తీసుకుని ఉంటే… ఎవరు రాయి వేశారో.. ఎందుకు రాయి వేశారో తేలిపోయేది. కానీ ఆ దిశగా ఆలోచించలేదు. అంటే వ్యవస్థ అచేతనం అయిందని అర్థం . దీని వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలంటే ఖచ్చితంగా .. సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ జరగాల్సిందే. మరి బాధితుడు అయిన జగన్ .. ఆయన పార్టీ ఈ డిమాండ్ చేయడానికి ముందుకు వస్తుందా ? అన్నదే అసలు సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close