మళ్లీ జనసేనలో చేరడానికి “జేడీ” మొహమాటపడుతున్నారా ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికి జనసేన పార్టీకి రాజీనామా చేసేశారు. సినిమాలు చేయనన్న పవన్ కల్యాణ్ .. మళ్లీ సినిమాలు ప్రారంభించడంతోనే రాజీనామా చేశానని .. తన రాజీనామాకు అప్పట్లో కారణం చెప్పారు. ఆ తర్వాత కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఓ స్వచ్చంద సంస్థ పెట్టి సామాజిక అంశాలపై ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన విశాఖ నుంచే ఎన్నికల‌లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఏ పార్టీ అని చెప్పడం లేదు. ఇండిపెండెంట్‌గా అని చెబుతున్నారు .

మళ్లీ జనసేన పార్టీలో చేరడానికి ఆయనకు మొహమాటం అడ్డు వస్తుందని.. పవన్ కల్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలో చేరే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జేడీ స్వయంగా రాజీనామా చేసి.. ఇప్పుడు మళ్లీ రావాలని పవన్ ఆహ్వానించడం ఏమిటన్నది జనసేనలో కొంతమంది నేతల అభిప్రాయం కావొచ్చు. కొన్ని కారణాల వల్ల ఆయన బీజేపీలో చేరలేరు.. టీడీపీలో అసలు చేరలేరు. ఆయన మార్గం జనసేన మాత్రమే. అందులో చేరాలనే ఆయనకూ ఉందని.. ఆయన స్పందన ద్వారా తెలుస్తోంది. జనసేన – టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకే కలుస్తున్నాయని అంటున్నారు.

జేడీ ఎన్నికల రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నందున పవన్ కల్యాణ్ ఆయనను మళ్లీ ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని పవన్ కోరుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందు ముందు జేడీ జనసేనలో చేరొచ్చని భావిస్తున్నారు. వీవీ లక్ష్మినారాయణ కూడా బెట్టు చేయకుండా ఓ మెట్టు దిగి పవన్ కల్యాణ్‌తో భేటీ అయితే సమస్య పరిష్కారం అవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close