కేసీఆర్ సన్నిహితులూ బీజేపీకీ కోట్లలో విరాళాలిస్తున్నారు !

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా బీజేపీకి కోట్లలో విరాళాలిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యశోదా ఆస్పత్రి ఏకంగా రూ.పది కోట్ల విరాళాన్ని బీజేపీకి ఇచ్చింది. యశోదా ఆస్పత్రి ఎవరిదో తెలంగాణ రాజకీయవర్గాలందరికీ తెలుసు. సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సమస్య వచ్చినా యశోదకే వెళ్తారు. టీఆర్ఎస్ నేతలకు ఆ ఆస్పత్రి.. తమ పార్టీ ఆస్పత్రి అన్నంత అనుబంధం ఉంటుంది. అలాంటి ఆస్పత్రి యాజమాన్యం.. బీజేపీకి ఏకంగా రూ. పది కోట్ల విరాళాన్ని ఇచ్చింది.

ఆ స్థాయిలో విరాళం ఇచ్చిన మరో కార్పొరేట్ సంస్థ లేదు. బీజేపీ నేత, విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన జి. వివెక్ మాత్రం రూ. మూడు కోట్లను విరాళంగా ఇచ్చారు. మిగిలిన వాళ్లు లక్షల్లోనే సమర్పించుకున్నారు. యశోదా ఆస్పత్రి యాజమాన్యానికి బీజేపీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇది ప్రేమ కాదని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో యశోదా ఆస్పత్రులపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ విరాళం ఇచ్చిందని.. మధ్యలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నాయి.

రాజకీయ పార్టీలు ఈసీకి ఇచ్ిచన వివరాలు ఆధారంగా ఏడీఆర్ సంస్థ ఈ డీటైల్స్ విడుదల చేసింది ఎలక్టోరల్ బాండ్స్ .. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళిచ్చే సౌకర్యం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలిస్తే.. పూర్తి గోప్యం. ట్రస్టుల ద్వారా ఇస్తే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. మొత్తానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో 75 శాతం బీజేపీకే వెళ్తాయి. మిగతా పాతిక శాతం అన్ని పార్టీలు పంచుకుంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా అతి తక్కువగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close