తన తండ్రి నోరు చాలా డేంజరంటున్న వైసీపీ ఎమ్మెల్యే !

జగన్ పై తిరగబడాలని పిలుపునిచ్చిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావును కంట్రోల్ చేయలేనని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ హైకమాండ్‌కు నేరుగా మీడియా ద్వారా సందేశం ఇచ్చారు. వరుసగా రెండు రోజుల పాటు వసంత నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన మాట్లాడకుండా చూసుకోవాలని పార్టీ హైకమాండ్ నుంచి సందేశం వచ్చింది. దీంతో ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.. తన తండ్రి నోరే ప్రమాదకరమని ఆ.. వాగే నోరు,తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రి ని ఆపలేమని ఆయన తేల్చేశారు.

అయితే తన తండ్రి మాటలతో తాను ఏకీభవించడం లేదని ఆ విషయాలను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెడ్డ పేరు తేకూడదనే విధంగా ప్రవర్తించేవాళ్ళమన్నారు. ఆయన నోరు చాలా ప్రమాదకరమన్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని, ఈ విషయాన్ని ఏ ఒక్క వైయస్సార్ అభిమాని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు.

అయితే వసంత కృష్ణప్రసాద్‌పై జగన్ పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకే ఇతరుల్ని నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశంపైనా వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. మైలవరం నియోజకవర్గం లో గందరగోళానికి కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని .. సొంత పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మంత్రి జోగి రమేష్, తో విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close