చంద్రబాబు సర్కార్ అంచనాలకే కేంద్రం ఆమోదం..! పోలవరంపై జగన్ వైఖరేంటి..?

కేంద్ర ప్రభుత్వం.. పోలవరం విషయంలో.. గత ప్రభుత్వం ఇచ్చిన అంచనాలను యధాతథంగా ఆమోదించింది. గతంలో పోలవరం నిర్మాణ వ్యయం… 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు ఉంది. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు సవరించారు. సవరించిన అంచనాలను ఆమోదింపచేసుకోవడానికి గత ఏపీ ప్రభుత్వం … కేంద్రంపై దండయాత్ర చేసినంత పని చేసింది. ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో.. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్రం సమాధానం ఇచ్చింది.

పోలవరం అంచనాలపై గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు..!

పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచడాన్ని.. వైసీపీ తీవ్రంగా తప్పు పట్టింది. రూ. పదహారు వేల కోట్ల నుంచి.. ఏకంగా.. యాభై ఐదు వేల కోట్లకు అంచనాలు పెంచడం అంటే… మొత్తం దోపిడీనేనని విమర్శలు గుప్పించారు. దీనిపై గతంలో… ప్రభుత్వం జీవో జారీ చేస్తే… కేంద్రం అనుమతి లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారంటూ.. మండిపడ్డారు. సాక్షి పత్రిక కూడా విస్తృతంగా కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతి సమావేశంలోనూ… పోలవరం అంచనాలపై విమర్శలు చేశారు. అందులో.. టీడీపీ నేతలు…. వేల కోట్లు అవినీతి చేశారని చెప్పారు. ఇప్పుడు అవే అంచనాలకు కేంద్రం ఆమోదం తెలియచేయడం ఆసక్తికరంగా మారింది.

పోలవరం అంచనాలపై గతంలో కావాలనే రాజకీయం చేశారా..?

నిజానికి 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు. అప్పట్లో భూసేకరణ చట్టం రాలేదు. ఆ తర్వాత యూపీఏ హయాంలో భూసేకరణ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చే ముందే.. భూసేకరణ చేసే అవకాశం ఉన్నప్పటికీ… రాష్ట్రంలో ఉన్న వైఎస్ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో… కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్… భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం.. పరిహారం.. మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులో.. అత్యధిక వ్యయం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే ఉంటుంది. పోలవరంలోనూ.. కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతాయి. వారందరికీ పరిహారం… మూడు రెట్లు పెరిగిపోయింది. ఫలితంగా… అంచనాలు పెరిగిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు… మాత్రం దోపిడీ కోసమే అంచనాలు పెంచారని.. పోరాటం చేసారు.

ఇప్పుడు పోలవరం అంచనాలపై వైసీపీ విధానం ఏమిటి..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. కాంట్రాక్టుల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాదాపుగా పనులన్నింటినీ నిలిపి వేయించారు. పోలవరంలోనూ… అవినీతి జరిగిందని.. అక్కడా సమీక్షకు ఆదేశించారు. పనులు తక్కువకు చేసే వారు ఉంటే.. వారికే పనులు ఇస్తామని చెబుతున్నారు. పోలవరాన్ని పరిశీలించిన సమయంలోనూ.. అవినీతిని తవ్వితీయాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో.. కేంద్రం… పోలవరం అంచనాల్లో… తప్పేమీ లేదని.. నేరుగా చెప్పినట్లుగా.. ఆమోదం తెలిపింది. కేంద్రమే అంచనాలను ఆమోదిస్తే.. అవినీతి ఎక్కడ ఉందని.. లోకేష్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close