డ్రామాస్ అన్‌లిమిటెడ్ : ఏపీ రాజకీయాలకు కొత్త కళ అద్దిన వైసీపీ !

అతడు సినిమాలో చూపించినట్లుగా రాజకీయాలను చేయడం అందరి వల్లా కాదు. ఎంత రాజకీయ నాయకుడు అయినా ఇలా ఎలా చేస్తాం అనుకుంటారు.. కానీ వైసీపీ నేతలకు అలాంటి బెరుకే ఉండదు. ప్రజలు నవ్వుతారని తెలిసినా కూడా తమను నమ్మేవారుంటారని.. వారు నమ్మితే మిగిలిన వారని నీలి, కూలి మీడియా.. సోషల్ మీడియతో నమ్మించవచ్చని అనుకుంటున్నారు. అందుకే వీధి డ్రామాలకు తగ్గని రీతిలో .. నటన కురిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు.

రాయి తగిలిందో లేదో తెలియదు.. కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పొద్దున్నే పోయి కంటికి ఓ బ్యాండేజ్ వేయించుకుని ఫోటోలు తీయించుకున్నారు. తనకేదో తీవ్రమైన గాయం అయిందన్నట్లుగా షో చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి వి అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఏకంగా ఆపరేషన్ రూమ్ లో టెస్టులు చేయించుకుని పది మంది వైద్యుల బృదంతో ఫోటో దిగారు. అక్కడేదో బ్రెయిల్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది… పేషంట్ వెంటనె లేచి కూర్చున్నాడన్నట్లుగా బిల్డప్. మళ్లీ అక్కడ ఆయన తన కాలుకు కూడా గాయం అయిదని చూపించడానికన్నట్లు దానికో కట్టు. ఇక ఆపరేషన్ దస్తులతో కలిసి ఓ ఫోటో కూడా రిలీజ్ చేశారు.

ఎవరైనా రోడ్డు మీద ఐదేళ్ల చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుతూ పడిపోతే అంత కంటే పెద్ద గాయాలే అవుతాయి. కానీ అలా పడి లేచిన మరుక్షణం మళ్ళీ సైకిల్ తొక్కుతాడు.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ రోజు విశ్రాంతి తీసేసుకున్నారు. ఆ విశ్రాంతిలో నీలి,కూలీ మీడియాకథలు అల్లితే వాటిని చూసి చిద్విలాసంగా రాజీకయం అంటే ఈ డ్రామాలే అన్నట్లుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక వైసీపీలోని నటుల సంఘం సీనియర్ యాక్టర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ల ఓవరాక్షన్ చూసి ప్రజలకు కూడా ఇదేదో… తేడాగా ఉందే అనిపించేలా చేసుకున్నారు.

రాజకీయ డ్రామాలపై ప్రజలకు అవగాహన పెరిగినట్లుగానే కనిపిస్తోంది. వైసీపీ సొంత సోషల్ మీడియా ఖాతాల్లోనే జగన్ డ్రామాలపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. పథకాల గురించి చెప్పుకుని మగాడిలా రాజకీయాలు చేద్దామన్నా.. ఈ డ్రామాలతో ప్రజలు నవ్వుతున్నారని సొంత పార్టీ కార్యకర్తల ఆక్రందనలు సోషల్ మీడయాలో వినిపిస్తున్నాయి. కానీ హోప్స్ లేని రాజకీయానికి డ్రామాలతో గాలి కొట్టాలని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో నటుల సంఘం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close