రఘురామపై అనర్హత కోసం తేలిపోయిన వైసీపీ ప్రయత్నాలు !

రఘురామకృష్ణరాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని కంగారు పడుతున్న వైసీపీ ఆ బాధ్యతను రాజమండ్రి ఎంపీ భరత్‌కు ఇచ్చింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎం చెప్పాలో చెప్పి పంపుతున్నప్పటికీ.. ఆయన వాదనలు రాజకీయవర్గాలకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎవరైనా బీజేపీ ఎంపీ మోదీని తిడుతూంటే ఊరుకుంటారా.. అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ కారణంగానైనా అనర్హతా వేటు వేయాలని అడుగుతున్నారు.

కానీ అనర్హతా చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఓ పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హతా వేటు వేస్తారు. సొంత పార్టీని ధిక్కరించడం.. పార్టీ అధినేతను విమర్శించడం… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనర్హతా వేటు కిందకు రాదు. రఘురామకృష్ణరాజు వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఏ ఇతర పార్టీలో చేరలేదు. అయినా అనర్హతా వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగానే కాదు.. రాజకీయంగా చూసినా రఘురామకృష్ణరాజు అనర్హతపై వైసీపీ ప్రయత్నాలు తేలిపోయాయన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నట్లుగా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా వైసీపీ జెండాలు వేసుకుని జనంలోకి వెళ్లడం లేదు. అయినా .. ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నది సంసారం కానీ రఘురామ చేస్తున్నది మాత్రం కాదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల వల్ల వైసీపీ అంటేనే ఓ రకమైన తేలిక భావం సాధారణ ప్రజల్లోనే కాదు.. ఉన్నత స్థాయిలోనూ ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close