వైసీపీ సమస్యలన్నింటికీ “గులకరాయి” మందు !

జగన్ పై రాయి దాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అసలేం జరిగిందో తెలిసీతెలియక ముందు… ” చంద్రబాబు ” అంటూ బిగ్గరగా కేకలు వేసుకుంటూ… పెద్దనోరున్న అంబటి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చేశారు. అంతా ప్లాన్డ్ గా జరిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు మరింత పకడ్బందీగా .. స్క్రిప్ట్ ప్రకారం అన్నట్లుగా రాజకీయాలు ప్రారంభించారు.

జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన లేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఆయనకు ఉండే సెక్యూరిటీ.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసేఅభ్యర్థి అతి కష్టం మీద తీసుకు వచ్చే ఒకటి,రెండు వందల మంది తప్ప సామాన్య జనం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో బస్సు యాత్రను ఆపలేక.. కొనసాగించలేక తంటాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే గులకరాయి ఎపిసోడ్ బయటకు వచ్చినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.

జగన్ పై రాయి దూసుకు వస్తే.. దానికి చంద్రబాబే కారణం అని ఆరోపించి.. సానుభూతి రాజకీయాలు ప్రారంభించగానే అసలేం జరిగిపోయిందో అందరికీ తెలిసిపోతుంది. సొంత పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ అయితే బోర్ కొడుతుంది కదా అన్న భావనకు వస్తున్నారు. అయితే ఇంతకు మించిన ఆలోచన … అనుభవం ఉన్న ఘటనలు తమకు చేతకావనుకున్నారేమో రంగంలోకి దిగిపోయారు.

రాయితో తగిలింది అతి చిన్న గాయం. చిన్న బ్యాండేజ్ వేసుకున్నారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి డ్రెస్ వేసుకుని వైద్య పరీక్షలు చేసుకుని ఫోటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. ఎందుకిదంతా ? ఓ వైపు లేని జనస్పందన.. మరో వైపు షర్మిల, సునీత వేస్తున్న ప్రశ్న… ఎన్నికల బరిలో వెనుకబడిన అన్నింటికీ… పరిష్కారాన్ని గులకరాయితో వెదుక్కున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close