ఏపి, తెలంగాణా భాజపా నేతలు కెసిఆర్ పై విమర్శలు

తెలంగాణా న్యాయవాదుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ డిల్లీలో ధర్నా చేయాలనుకొన్నట్లుగా వచ్చిన వార్తలపై ఇంకా ప్రకంపనలు కలుగుతూనే ఉన్నాయి. విశేషమేమిటంటే, ఆ రెండు లక్ష్యాలకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తి మద్దతు ప్రకటిస్తూనే మళ్ళీ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే, దీనిపై తెలంగాణా పార్టీలతో బాటు ఆంధ్రాలో పార్టీలు కూడా స్పందిస్తున్నాయి.

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు విభజనకి అంగీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది మార్చిలోనే లేఖ ఇచ్చారని చెప్పడం మరో విశేషం. మరయితే విభజనకి ఎందుకు సహకరించడం లేదు? అనే సందేహం కలుగుతుంది. తెలంగాణాపై కర్ర పెత్తనం చేసేందుకేనని తెరాస నేతలు వాదిస్తున్నారు. కానీ తెరాసయే ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని ఏపి, తెలంగాణా తెదేపా నేతలు వాదిస్తున్నారు. ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకు కెసిఆర్ న్యాయవ్యవస్థని సైతం వాడుకోవడానికి వెనకాడటం లేదని తెదేపా ఏపి అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు నాయుడుకి సంబంధం లేకపోయినా ఆయన పేరు చెప్పుకొని తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

తెలంగాణా భాజపా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “కెసిఆర్ డిల్లీలో ధర్నా చేయడం కంటే అమరావతిలో చేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాను. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు ప్రయత్నించకుండా సమస్యని ఇంకా పెద్దది చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను,” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భాజపా నేత మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మరోవిధంగా స్పందించారు. “హైకోర్టు విభజన జరిగితే గానీ సంపూర్ణ తెలంగాణా ఏర్పడినట్లు కాదని వాదిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా షెడ్యూల్ 9, 10ల క్రింద ఉన్న సంస్థలని విభజించి ఆ తరువాత హైకోర్టు విభజన గురించి మాట్లాడితే బాగుంటుంది. నిజానికి కెసిఆర్ ని ప్రసన్నం చేసుకోనేందుకే ఆనాడు యూపియే ప్రభుత్వం అడ్డుగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఏపికి తీరని అన్యాయం చేసింది. విభజన వలన అన్ని విధాల తెలంగాణాయే ప్రయోజనం పొందింది. ఇప్పుడు హైకోర్టు విభజనకి కూడా కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. ఆ వ్యవహారం హైకోర్టులోనే ఉందని కెసిఆర్ కూడా తెలుసు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యని ఏమార్చడానికే కెసిఆర్ డిల్లీలో దీక్ష అంటున్నారని నేను భావిస్తున్నాను,” అని కామినేని శ్రీనివాస్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close