ప్రామిస్… రాజుకి ఎన్టీఆర్-త్రివిక్రమ్ నైజామ్ రైట్స్!

‘అజ్ఞాతవాసి’తో దిల్ రాజు డబ్బులు 18 కోట్ల వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. పవన్ కళ్యాణ్ మేనియా చూసి ముచ్చటపడ్డారో లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంపై నమ్మకమో 29 కోట్లకు నైజామ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నారు. విడుదల తర్వాత లెక్కలు చూసుకుంటే దాదాపుగా 18 కోట్లు జామ్ అయ్యాయి. 65% లాస్ వచ్చింది. అఫ్ కోర్స్, ‘అజ్ఞాతవాసి’ రైట్స్ ఎక్కువ రేటు పెట్టి కొన్న అందరి డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఇంచుమించు ఇంతే. నష్టాలను ఎంతోకొంత తీరుస్తాడని పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళితే ఎలాంటి లాభం జరగలేదు. నిర్మాతతోనే మాట్లాడుకోండి నేనేమీ చేయలేనని చెప్పేశారట. అటు తిరిగి ఇటు తిరిగి పంచాయితీ నిర్మాత చినబాబు చెంతకు వచ్చింది. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ సంగతి పక్కన పెడితే దిల్ రాజుకు మాత్రం ఆయన దగ్గరనుంచి అభయం వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా నైజామ్ రైట్స్ మీకు తప్ప ఎవరికీ ఇవ్వననీ, అప్పుడు లెక్కలు చూసుకుందామనీ దిల్ రాజుకి చినబాబు ప్రామిస్ చేశారని సమాచారమ్. ‘అజ్ఞాతవాసి’ నష్టాల్లో కూడా కొంత షేర్ చేసుకుంటాననీ, త్వరలో సెటిల్ చేసుకుందామనీ చెప్పారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.